Tuesday, 23 January 2018

గోడు వినరు.. గూడు కట్టరు!

గోడు వినరు.. గూడు కట్టరు!
Jan 23, 2018, 02:19 IST
 Rehabilitation process in telangana  - Sakshi
ప్రధాన ప్రాజెక్టుల కింద పదేళ్లయినా పూర్తి కాని పునరావాస పనులు

అరిగోస పడుతున్న నిర్వాసితులు

ఇల్లు లేక కొందరు.. ఉన్నా వసతుల్లేక ఎందరో..

పలు కాలనీల్లో తాగునీరు, కరెంట్‌కు కటకట

84 ముంపు గ్రామాల్లో సామాజిక సర్వే పూర్తయింది 77 గ్రామాల్లోనే

44,794 నిర్వాసితుల్లో 24,891 మంది మాత్రమే తరలింపు 

35,385 ఇళ్లకుగానూ పూర్త్తయింది కేవలం 16,859

సాక్షి, హైదరాబాద్‌ :  ఏళ్లు గడుస్తున్నా రాష్ట్రంలో నిర్వాసితుల వెతలు మాత్రం తీరడం లేదు! ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల కింద సహాయ, పునరావాస ప్రక్రియ పదేళ్లయినా ఇంకా సాగుతూనే ఉంది. మిడ్‌ మానేరు, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, ఇందిరమ్మ వరద కాల్వ వంటి ప్రాజెక్టుల కింద సహాయ, పునరావాస పనులు పూర్తి చేసి ఆయకట్టుకు నీరందించాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నా... పునరావాస ప్రక్రియ మాత్రం నత్తనడకను తలపిస్తోంది. నిధుల కేటాయింపు, పట్టాల పంపిణీ, గృహ వసతి కల్పన, ఇప్పటికే నిర్మించిన పునరావాస కాలనీల్లో వసతుల లేమి.. ఇలా ఒక్కటేమిటీ అన్నింటా అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కనిపిస్తోంది.

ఇళ్లు కట్టేది ఇంకెప్పుడు?
పద్నాలుగేళ్ల క్రితం చేపట్టిన ఎస్‌ఎల్‌బీసీ, ఎస్సారెస్పీ స్టేజ్‌–2, దేవాదుల, వరద కాల్వ, ఎల్లంపల్లి, సుద్దవాగు, కొమురం భీం, గొల్లవాగు, నీల్వాయి, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టు కింద 65 గ్రామాలు పూర్తిగా, 19 పాక్షికంగా కలిపి మొత్తంగా 84 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఈ గ్రామాలలో 44,794 మంది నిర్వాసితులవుతున్నారు. వీరందరికీ పునరావాస (ఆర్‌అండ్‌ఆర్‌) కేంద్రాలు ఏర్పాటు చేసి.. గృహాల నిర్మాణం, రోడ్లు, తాగునీరు, కరెంట్‌ కనెక్షన్‌ల వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి.

అయితే ఇప్పటివరకు 84 ముంపు గ్రామాలకుగానూ 77 గ్రామాల్లోనే సామాజిక ఆర్థిక సర్వే (ఎస్‌ఈఎస్‌) పూర్తయింది. 44వేల పైచిలుకు మందిలో 24,891 మందిని మాత్రమే ఇప్పటివరకు పునరావాస కేంద్రాలకు తరలించారు. వీరికోసం 16,859 నివాస గృహాలను నిర్మించారు. ఇంకా 18,526 గృహాలు, ఇతర వసతుల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. దీనికోసం మరో రూ.1,262 కోట్ల మేర నిధులు అవసరం కానున్నాయి. అయితే ఈ ప్రక్రియ నెమ్మదిగా సాగుతుండటంతో ఎప్పటిలోగా పునరావాసం పూర్తవుతుందన్నది పెద్ద ప్రశ్నగా మారింది.


ప్రాజెక్టుల కింద అన్నీ సమస్యలే..
రానున్న జూన్‌ నాటికి పనులు పూర్తి చేసి సాగుకు నీటిని అందించాలని భావిస్తున్న ప్రాజెక్టుల్లో పాలమూరు జిల్లా ప్రాజెక్టులు కీలకం. ఇక్కడి భీమా ప్రాజెక్టు కింద 8 ముంపు గ్రామాలుండగా, మొత్తంగా 6,156 మందిని నిర్వాసితులుగా గుర్తించారు. అయితే ఇందులో 3,500 మందికి మాత్రమే పట్టాల పంపిణీ పూర్తయింది.

మౌలిక వసతుల పనులు ఇంకా మధ్యలోనే ఉన్నాయి. కనాయిపల్లి, శ్రీరంగాపూర్, నేరేడ్‌గావ్, భూత్పూర్, ఉజ్జెల్లి గ్రామాలలో నిర్వాసితులకు గృహాల నిర్మాణం వేగిరం చేయాల్సి ఉంది. సంగంబండలో ఇళ్ల నిర్మాణం అసంపూర్తిగానే ఉంది. నెట్టెంపాడు కింద ముంపునకు గురయ్యే చిన్నానిపల్లి, ఆలూర్, రేతామ్‌పాడ్‌ గ్రామాల నిర్వాసితులకు పట్టాలు ఇచ్చినప్పటికీ అక్కడ ఈ ఏడాది చివరికి రోడ్లు, నీరు, విద్యుత్‌ సదుపాయాలు సమకూర్చాల్సి ఉంది.

కాలనీల్లో వసతులేవీ..?
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 25 టీఎంసీల సామర్థ్యంతో మిడ్‌మానేరు ప్రాజెక్టు నిర్మిస్తుండగా, బోయినపల్లి మండలంలో కొదురుపాక, వరదవెల్లి, నీలోజిపల్లి, శాభాష్‌పల్లి, తంగళ్లపల్లి మండలంలో చీర్లవంచ, చింతలఠాణా, వేములవాడ రూరల్‌ మండలంలో అనుపురం, రుద్రవరం, కొడుముంజ, సంకెపెల్లి గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఆయా గ్రామాల్లో 11,731 కుటుంబాలు నిర్వాసితులవుతున్నాయి.

వీరందరికి పునరావాసం కోసం సుమారు రూ.100 కోట్లతో ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలు ఏర్పాటు చేశారు. ఒక్కో నిర్వాసిత కుటుంబానికి 242 చదరపు గజాల ఇంటి స్థలం ఇచ్చారు. ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీల్లో సుమారు మూడు వేలకు పైగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశారు. మరో 1,500 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇదే ప్రాజెక్టు కింద కొదురుపాక, నీలోజిపల్లి ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీల్లో రూ.80 లక్షల అంచనాలతో నీటి పథకాలు నిర్మించారు. అయితే సీసీ రహదారులు నిర్మించాక పైప్‌లైన్లు వేయడానికి కందకాలు తవ్వారు. కొన్ని చోట్ల రోడ్లు బ్లాస్ట్‌ చే«శారు. దీంతో పలు సీసీ రహదారులు పగుళ్లు బారాయి.

ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారుల అనాలోచిత చర్యతో శాభాష్‌పల్లి వాగులో నీటి వసతి కోసం మంచినీటి బావులు తవ్వించారు. అయితే వాగులో నీరు చేరడంతో బావులు మునిగిపోయాయి. రోడ్డు నిర్మాణంలో పైప్‌లైన్‌ వ్యవస్థ ఛిన్నాభిన్నం అయింది. దీంతో పునరావాస కాలనీల్లో నీరు దొరక్క నిర్వాసితులు పుట్టెడు కష్టాలు ఎదుర్కొంటున్నారు. పలు పునరావాస కాలనీల్లో నిర్వాసితులకు ఇళ్లను అప్పగించడంలో తీవ్ర జాప్యం వల్ల మురుగు కాలువలు మట్టి, పిచ్చి చెట్లతో పూడుకు పోయాయి. పలుచోట్ల విద్యుత్‌ సదుపాయం లేక నిర్వాసితులు ఇబ్బందులు పడుతున్నారు.

అరిగోస పడుతున్నారు
మిడ్‌మానేరు ప్రాజెక్టులోకి నీరు చేరిందని.. పునరావాస కాలనీలకు తరలాలని అధికారులు ఆదేశించడంతో కట్టు బట్టలతో ఊళ్లు వదిలి ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలకు చేరాము. ఇక్కడ నీటి వసతి లేదు. వాగులో బావులు తవ్వితే మునిగి పోయాయి. సీసీ రోడ్లు పగుళ్లు బారాయి. మౌలిక వసతులు లేక నిర్వాసితులు అరిగోస పడుతున్నారు.     – కూస రవీందర్, ముంపు గ్రామాల ఐక్యవేదిక అధ్యక్షుడు

ఇళ్ల బిల్లులు చెల్లించలేదు
సంగంబండ ఆర్‌ఆర్‌ సెంటర్‌లో ఇళ్లు కట్టుకోవాలంటే బిల్లులు ఇవ్వడంలేదు. జీవో విడుదల చేసి సంవత్సరాలు గడిచినా కొంతమందికి ప్లాట్లు రాలేదు. సర్వం కోల్పోయిన తమను ఆదుకుంటామని చెప్పడం తప్ప సమస్యలు పరిష్కరించడంలేదు.      – అనంతరెడ్డి, సంగంబండ, బీమా ప్రాజెక్టు నిర్వాసితుడు

ఇంటి నిర్మాణ బిల్లులు చెల్లించాలి
ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీల్లో వేల మంది నిర్వాసితులు రూ.లక్షలు వెచ్చించి ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసిన వారికి బిల్లులు విడుదల చేయాలి.  – ఆడెపు రాజు, వరదవెల్లి, మిడ్‌మానేరు నిర్వాసితుడు

Caryota urens - Fishtail Palm - జీలుగు - జీరిక

Caryota urens - జీలుగు - జీరిక 

Jeelugu (Telugu: జిలుగు) 
Arecaceae (palm family) » Caryota urens


kair-ee-OH-tuh or kar-RY-oh-tuh -- from the Greek karyon (nut)

UR-ens -- burning or stinging


commonly known as: bastard sago tree, fishtail palm, jaggery palm, toddy palm, wine palm • Hindi: बन खजूर ban-khajur, माड़ी mari • Kannada: ಬಯ್ನೆ bayne • Konkani: बिरलोमाड birlomaad • Malayalam: ചൂണ്ടപ്പന cuuntappana • Marathi: भेरली माड bherli-maad, सुरमाड sur-maad • Oriya: salap • Sanskrit: श्रीताल sritalah • Tamil: கூந்தற்பனை kuntaypanai, திப்பிலிப்பனை tippili-p-panai • Telugu: జిలుగు jeelugu


Native to: India, Myanmar, Sri Lanka, Malaysia; widely cultivated.


Caryota urens
From Wikipedia, the free encyclopedia
Caryota urens
Caryota urens full.jpg
Scientific classification e
Kingdom: Plantae
Clade: Angiosperms
Clade: Monocots
Clade: Commelinids
Order: Arecales
Family: Arecaceae
Genus: Caryota
Species: C. urens
Binomial name
Caryota urens
L.
Caryota urens is a species of flowering plant in the palm family from the Indian Subcontinent and Southeast Asia where they grow in fields and rainforest clearings. The epithet urens is Latin for "stinging" alluding to the chemicals in the fruit. They are commonly called solitary fishtail palm, toddy palm, wine palm, jaggery palm கூந்தற்பனை - Koonthal Panai in Tamil, කිතුල් - Kithull in Sinhala, ಬೈನೆ ಮರ in Kannada, ചൂണ്ടപ്പന - Choondappana in Malayalam চাউর in Bengali,. Its leaf is used as fishing rod after trimming the branches of the leaf and drying. According to Monier-Williams, it is called moha-karin ("delusion maker") in Sanskrit. It is one of the sugar palms.

Contents  [hide] 
1 Description
2 Uses
3 Cultivation
4 References
5 Bibliography
6 External links
Description[edit]

Caryota urens trees.

Caryota urens unripe fruit.
Caryota urens species is a solitary-trunked tree that measure up to 12 m (39 ft) in height and up to 30 cm (12 in) wide. Widely spaced leaf-scar rings cover its gray trunk which culminate in a 6 m (20 ft) wide, 6 m tall leaf crown. The bipinnate leaves are triangular in shape, bright to deep green, 3.5 m (11 ft) long, and held on 60 cm (24 in) long petioles. The obdeltoid pinnae are 30 cm long with a pointed edge and a jagged edge.

The 3 m (9.8 ft) long inflorescences emerge at each leaf node, from top to bottom, producing pendent clusters of white, unisexual flowers. The fruit matures to a round, 1 cm (0.39 in) drupe, red in color with one seed. Like all Caryotas, the fruit contains oxalic acid, a skin and membrane irritant. As these plants are monocarpic, the completion of the flower and fruiting process results in the death of the tree.

Uses[edit]
This species is called kithul (කිතුල්) in Sri Lanka. It is the source of kithul treacle, a liquid jaggery.[1] Toddy is extracted from the inflorescence, and is considered some what powerful compared to toddy extracted from few other palm trees. Pulp of the fully grown up plant is cut, sun dried, powdered and is edible. It is sweet in taste.[2][3] This powder is considered cool and nutritius in Coastal districts of Karnataka. Elephants are fed both the leaf and the pulp of this plant.


Famous Bastar Beer prepared from Caryota urens
Cultivation[edit]
Caryota urens is cultivated as an ornamental tree, and planted in gardens and parks in tropical and sub-tropical climates. It is also used as an interior and houseplant when smaller.

జీరిక నీరా, బెల్లం భేష్ 

జీరిక నీరా, బెల్లం భేష్‌!
Jan 23, 2018, 01:08 IST
 Fishtail Palm Tree neera - Sakshi
తాటి కన్నా 6–7 రెట్ల నీరా దిగుబడినిస్తున్న జీరిక చెట్లు

తాటి చెట్లకు మాదిరిగానే ఎరువులు, మందులు, నీరు వేయనవసరం లేదు

ఆరేళ్లకే నీరా దిగుబడి ప్రారంభం.. 25 ఏళ్ల వరకు రోజుకు సగటున 30–40 లీటర్ల నీరా దిగుబడి

ఛత్తీస్‌గఢ్‌లోని జగ్‌దల్‌పూర్‌ ప్రాంతంలో గిరిజనులకు జీరిక నీరా, కల్లే ప్రధాన ఆదాయమార్గం

ఏటా రూ. 30 వేల నుంచి 40 వేల వరకు ఆదాయం

తెలంగాణలో , ఆంధ్రప్రదేశ్‌లో సముద్రతలం నుంచి 250 ఎం.ఎస్‌.ఎల్‌. కన్నా ఎత్తయిన ప్రాంతాల్లో సాగుకు అనుకూలం

తాటి బెల్లంలో మాదిరిగానే జీరిక బెల్లంలోనూ పోషకాలు, ఔషధ గుణాలు

తాటి బెల్లం ద్వారా ఒనగూడే ఔషధ గుణాలు, పోషక విలువలు ఎన్నో. అనాదిగా మన పెద్దలు వాడుతున్న ఆరోగ్యదాయకమైనది తాటి బెల్లం. ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవల కాలంలో తాటి బెల్లానికి, ఆరోగ్య పానీయంగా తాటి నీరా వాడకానికి మళ్లీ ఆదరణ పెరుగుతోంది. తాటి బెల్లాన్ని సాధారణ పంచదార, బెల్లానికి బదులుగా వాడటం ఎంతో ఆరోగ్యదాయకమని వైద్యులు చెబుతున్నారు. అందువల్లే మధుమేహ రోగులు సైతం తాటి బెల్లాన్ని నిక్షేపంగా వాడుతున్నట్లు చెబుతున్నారు.

అయితే, ఈ బెల్లం తయారీకి అవసరమైన నీరా ఉత్పత్తి తాటి చెట్టుకు రోజుకు 5–6 లీటర్లకు మాత్రమే పరిమితం. తాటి నీరా కన్నా జీరిక నీరా రుచికరమైనది. తాటి బెల్లానికి దీటుగా ఔషధగుణాలు, పోషకాలు కలిగి ఉండే ‘జీరిక’ బెల్లాన్ని భారీ ఎత్తున ఉత్పత్తి చేసే దిశగా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ప్రజా ప్రతినిధులు ఇటీవల వేలాది జీరిక మొక్కలను నర్సరీల నుంచి సేకరించి తమ నియోజకవర్గాల్లో పంపిణీ చేస్తున్నారు.

భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి ఇటీవల నల్లగొండ జిల్లా మల్లేపల్లిలో తాటి పరిశోధనా స్థానాన్ని మంజూరు చేసింది. ఈ కేంద్రంలో జీరిక చెట్లపై కూడా పరిశోధన ప్రారంభించటం మేలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, ఈ జీరిక చెట్ల మాదిరిగానే కనిపించే అలంకారప్రాయమైన మరో జాతి చెట్లు కూడా ఉన్నాయని, వీటిని కేవలం అందం కోసం లాండ్‌స్కేపింగ్‌లో వాడుతున్నారని.. నీరా కోసం జీరిక మొక్కలను నాటుకునే రైతులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గిరిజనుల కల్పవృక్షం.. జీరిక
జీరిక చెట్టును సుల్ఫి లేదా ఫిష్‌టైల్‌ పామ్‌ అని కూడా పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో గిరిజనులు సాంప్రదాయకంగా జీరిక నీరాను, కల్లును ఆరోగ్యపానీయంగా వాడుతున్నారు. తాటి చెట్ల నీరా/కల్లు కన్నా రుచికరమైనది కావడంతో జీరిక నీరా/కల్లుకు జగదల్‌పూర్, బస్తర్‌ ప్రాంతాల్లో గిరాకీ ఎక్కువగా ఉంది. ఇది గిరిజనులకు ముఖ్యమైన ఆదాయ వనరుగా కూడా ఉంది.


నాటిన ఆరేళ్ల నుంచే నీరా దిగుబడి..
జీరిక మొక్క నాటిన ఆరేళ్ల నుంచి 25 ఏళ్ల వరకు.. ఒక్కో జీరిక చెట్టు నుంచి సగటున 30–40 లీటర్ల నీరాను సేకరిస్తున్నారు. భూసారం తదితర సానుకూలతల వల్ల కొన్ని చెట్ల నుంచి రోజుకు 50–60 లీటర్ల వరకు నీరాను సేకరిస్తూ, ఆరోగ్య పానీయంగా వినియోగిస్తున్నారు. బియ్యాన్ని ఉడికించి అన్నం వండుకోవడానికి నీటికి బదులు జీరిక నీరాను గిరిజనులు వినియోగిస్తుంటారు. తద్వారా కేన్సర్, తదితర జబ్బులు నయమవుతున్నాయని కూడా గిరిజన సంప్రదాయ వైద్యులు విశ్వసిస్తున్నారు.

ఆ విధంగా జీరిక నీరా/కల్లు ఛత్తీస్‌గఢ్‌ – ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు జగదల్‌పూర్, మారేడుమిల్లి ప్రాంతాల్లో గిరిజనులకు ప్రధాన ఆదాయ వనరుగానే కాకుండా.. వారి ఆహార సంస్కృతిలో ప్రధాన భూమికను నిర్వహిస్తున్నది. అందువల్లనే గిరిజనులు జీరిక చెట్టును కల్పవృక్షంగా కొలుస్తారు. ఆడ పిల్లకు ఒక్కో చెట్టు చొప్పున పుట్టింటి వాళ్లు కానుకగా ఇచ్చే అలవాటు కూడా అక్కడ అనాదిగా ఉన్నది. ఈ కారణంగా ఒక్కో చెట్టు నుంచి ఏటా రూ. 30 వేల నుంచి 40 వేల వరకు గిరిజనులు ఆదాయం పొందుతుండటం విశేషం.

మైదాన ప్రాంతాలకు జీరిక అనువైనదేనా?
జీరిక చెట్లు ప్రస్తుతం ఆంధ్ర–ఒడిశా– ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల సరిహద్దుల్లోని ఎత్తయిన గిరిజన ప్రాంతాల్లో సహజసిద్ధంగా పెరుగుతున్నాయి. తాటి చెట్ల కన్నా 6–7 రెట్ల నీరా దిగుబడినిస్తున్నాయి. అయితే, మైదాన ప్రాంతాల్లో ఈ చెట్లు ఇదే మాదిరిగా అధికంగా నీరా దిగుబడిని ఇస్తాయా? లేదా? అన్నది వేచి చూడాలని డా. వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయానికి చెందిన తూర్పు గోదావరి జిల్లా పందిరిమామిడిలోని తాటి పరిశోధనా స్థానం సీనియర్‌ ఆహార శుద్ధి శాస్త్రవేత్త పి. సి. వెంగయ్య ‘సాగుబడి’ తో చెప్పారు.

అనాదిగా జీరిక పెరుగుతున్న మారేడుమిల్లి తదితర ప్రాంతాలు సముద్ర తలం నుంచి 250 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. ఈ విధంగా చూస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాలతోపాటు తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాంతాలు వీటి కన్నా ఎత్తయినవే. కాబట్టి, సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో మినహా ఎత్తయిన మైదాన ప్రాంతాల్లో కూడా జీరిక సాగు లాభదాయకంగానే ఉండొచ్చని ఆయన చెబుతున్నారు. అయితే, జీరిక నీరా దిగుబడిపై వాతావరణం, భూములు.. ఇంకా ఇతర అంశాల ప్రభావం ఏమేరకు ఉంటుందో శాస్త్రీయంగా అధ్యయనం చేయాల్సి ఉంది.

జగదల్‌పూర్‌లో రెండేళ్ల క్రితమే జీరికపై ప్రత్యేక పరిశోధనా స్థానం ఏర్పాటైంది. దీనిలో పరిశోధనలు ప్రస్తుతం శైశవ దశలోనే ఉన్నాయి. వెంగయ్య తమ పరిశోధనా స్థానంలో గత ఏడాది గిరిజనుల నుంచి సేకరించిన జీరిక మొక్కలను నాటారు. మైదాన ప్రాంతాల్లో కూడా నీరా దిగుబడి బాగా ఉందని రుజువైతే.. ఆరోగ్యదాయకమైన పానీయం నీరాతో పాటు ఔషధగుణాలుండే సహజ జీరిక బెల్లాన్ని కూడా భారీ మొత్తంలో ఉత్పత్తి చేసి, అశేష ప్రజానీకానికి అందుబాటులోకి తేవటం సాధ్యమవుతుందని వెంగయ్య అన్నారు. తాటి బెల్లంలో మాదిరిగా జీరిక బెల్లంలో కూడా గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువ కాబట్టి.. సాధారణ పంచదార/బెల్లానికి బదులు తాటి/జీరిక బెల్లాన్ని ఏ వయస్సు వారైనా, మధుమేహ రోగులు సైతం వాడొచ్చని ఆయన తెలిపారు.

100 లీటర్ల జీరిక నీరాతో 15 కిలోల బెల్లం
తాటి నీరా కన్నా జీరిక నీరా రుచికరమైనది కూడా. జీరిక నీరాతో తాటి నీరాతో మాదిరిగానే 12–15% బెల్లం రికవరీ(100 లీటర్ల నీరాను ఉడికించితే 12–15 కిలోల బెల్లం ఉత్పత్తి) వస్తున్నదని వెంగయ్య జరిపిన ప్రాధమిక అధ్యయనంలో తేలింది. అయితే, ఔషధగుణాలు, ఖనిజలవణాలు, పోషకాల విషయంలో కూడా తాటి, జీరిక నీరాల మధ్య తేడా ఏమైనా ఉందా అనేది పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాల్సి ఉన్నప్పటికీ.. పెద్దగా తేడా ఉండకపోవచ్చు అని వెంగయ్య (94931 28932) తెలిపారు.

జీరిక చెట్ల వద్ద రాలిపడిన కాయల ద్వారా మొక్కలు మొలుస్తుంటాయి. గిరిజనులు వాటిని తెచ్చి మారేడుమిల్లి, రంపచోడవరం ప్రాంతాల్లో వారపు సంతల్లో విక్రయిస్తుంటారు. జీరిక చెట్ల కాయలు పెద్ద రేగు కాయల సైజులో ఉంటాయి. జీరిక చెట్లలో వైవిధ్యం, అవి పెరుగుతున్న భూములను బట్టి వాటి కాయల రంగులో తేడా కనిపిస్తోంది. ఈ కాయల నుంచి విత్తనాలను సేకరించి.. నర్సరీలో మొక్కలను పెంచుకొని నాటుకోవటం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

https://www.sakshi.com/news/family/fishtail-palm-tree-neera-1006640
– పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్‌

Wednesday, 22 November 2017

Meeting with Committee on Rehabilitation and Resettlement

Meeting with Committee on Rehabilitation and Resettlement
Meeting with Committee on Rehabilitation and Resettlement
“The completion of Polavaram is my ultimate life goal”, said Chief Minister Chandrababu Naidu, during a meeting with the Committee on Rehabilitation and Resettlement (R&R).
On Wednesday, he met with committee members Leena Nair and G. Latha Krishna Rao, who visited the Polavaram site in the last two days. They said that they were satisfied with the provisions for rehabilitation and the compensation for migrant villagers.
They visited all three villages and said that the R & R provided by the state government have good houses, and can accommodate all displaced persons.
The Chief Minister said that the reports on land acquisition, compensation and rehabilitation will be submitted to the Centre, along with the possibilities of a Godavari-Penna-Kaveri linking project.
The Centre was supposed to release funds faster, he said. “It is not good to delay the progress of this project, as there are already many obstacles, and forces that are trying to provoke migrant villagers. We need more cooperation from the Centre and we still have not received the promised special package”, he added.
“I spend 4 hours every week concentrating on the development of this project. I did not face these many obstacles when I developed an entire city (Cyberabad)”, he said.
He said that the government prioritises water management, because the success of the agriculture sector determines almost everything else in the state.
“The bifurcation of the state was an unjust and a sudden move. Without a capital city, our state was formed. Only with the Centre’s full support, can there be progress in the state”, said the Chief Minister at the meeting held in the Assembly.

AP desperate for Centre’s help

AP desperate for Centre’s help
THE HANS INDIA |    Nov 23,2017 , 03:06 AM IST       


Leena Nair, Secretary, Tribal Welfare and Chairperson, Committee on Rehabilitation and Resettlement, Polavaram, and other members meeting Chief Minister N Chandrababu Naidu at his chamber in Assembly on Wednesday. Water Resources Minister Devineni Uma Maheswara Rao is also seen.

Leena Nair, Secretary, Tribal Welfare and Chairperson, Committee on Rehabilitation and Resettlement, Polavaram, and other members meeting Chief Minister N Chandrababu Naidu at his chamber in Assembly on Wednesday. Water Resources Minister Devineni Uma Maheswara Rao is also seen.

Amaravati: Chief Minister N Chandrababu Naidu said the State government would get into trouble if the Union government did not extend full support to Polavaram irrigation project.

Naidu said the State government would complete the construction of project within two years if the Centre grants funds in time. He said Rs 54,000 crore was needed to complete the mega irrigation project in the world. Replying to a discussion on Polavaram project in the Assembly on Wednesday, the Chief Minister put all the information about the project before the House.

Though Chandrababu Naidu did not make any direct criticism on the Union government, he indirectly hinted that the Centre has been resorting to delaying tactics in release of funds. However, Naidu said the Centre has been responding quickly to the appeals of him.



Naidu said the total estimated cost of the project at 2010-11 was Rs 16,010.45 crore and the State government had spent Rs 7,431.35 crore up to October-end 2017. The balance amount to be given by Centre to AP was Rs 3,102.29 crore, he said.

The Chief Minister said as per revised estimates as on April 1, 2014, the project cost was augmented to Rs 58,319.06 crore. “We submitted the revised estimates to the Centre in this regard,” he said. The Union Cabinet of UPA government had approved (on May 1, 2014) to bear all further expenses on Polavaram project, he added.

Naidu also said the Union Finance Minister Arun Jaitley announced special assistance measure for funding Externally Aided Projects (EAPs) and Central funding of remaining cost of irrigation component of Polavaram project assessed as on April 1, 2014.

But the Union Cabinet on March 15, 2017 approved to provide 100 per cent of the remaining cost of the irrigation component only for a period starting from April 1, 2014, he said. 

Though the State government wants to speed up the works, Naidu said it would not be possible if the Centre fails to release funds in a timely manner. “I told the same to the Union government officials who visited the project recently. Polavaram cannot be built without the support of the Centre,” the Chief Minister said.

Naidu said works of spill channel and spillway were divided into parts and fresh tenders had been invited to speed up the works. The tenders would be finalised in second week of December, he said. The Chief Minister also said the coffer dam works had been initiated on Wednesday and the government was considering entrusting main dam works to a special contractor.

He criticised the Congress and YSR Congress party for creating hurdles. “Instead of criticising the government, the Congress should have completed the project during its tenure,” he said. Naidu made it clear that the project works were going on in a transparent manner and appealed to all parties to cooperate with the government to get funds from the Centre.

Tuesday, 17 October 2017

పోలవరం పూర్తి కావాలి!

పోలవరం పూర్తి కావాలి!
18-10-2017 03:05:53


రేట్లు పెంచుతారా.. కాంట్రాక్టరును మారుస్తారా మీ ఇష్టం
పనులు వేగంగా జరగడమే మా అభిమతం
పాత రేట్లతో పనులు చేయలేని పరిస్థితి
కాంట్రాక్టు సంస్థ ఆర్థిక స్థితి బాగోలేదు
మా ఉద్దేశం అర్థం చేసుకుని సహకరించండి
గడ్కరీకి ముఖ్యమంత్రి చంద్రబాబు వినతి
స్వయంగా నాగపూర్‌ వెళ్లి మంత్రితో చర్చలు
ఈనెల 24, 25 తేదీల్లో చర్చిస్తామన్న గడ్కరీ
పోలవరం పూర్తికి సంపూర్ణ సహకారంపై హామీ
అమరావతి, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టుకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని, దీని పూర్తికి సహకరిస్తామని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే.. మహానది- గోదావరి - కావేరీల అనుసంధానం చేయాలన్న ఆలోచనలో ఉన్నామన్నారు. మహారాష్ట్రలోని నాగపూర్‌లో గడ్కరీని సీఎం చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమా, ఇతర అధికారులు కలిశారు. ‘పోలవరం కాంట్రాక్టరును మార్చలేం. ఇప్పుడు మార్చితే అదనపు భారం పడుతుంది’ అని గడ్కరీ పేర్కొన్నట్లు మంగళవారం వార్తలు రావడం... అటు, కేంద్ర జలవనరుల శాఖ అధికారులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నట్లు తెలియడంతో సీఎం ఆగమేఘాల మీద స్పందించారు. విశాఖ నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లాల్సిన ఆయన... అప్పటికప్పుడు గడ్కరీ వద్ద సమయం తీసుకుని, నాగపూర్‌కు
వెళ్లారు. గడ్కరీతో గంటా 40 నిమిషాలపాటు చర్చించారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి చోటు చేసుకున్న పరిణామాలను పూసగుచ్చినట్లు వివరించారు. ‘‘2018నాటికి గ్రావిటీ ద్వారా నీళ్లివ్వాలని, 2019 ఎన్నికల నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పుడు వర్షాలు తగ్గుముఖం పట్టినందున పనులు వేగిరం చేయాలి. లేకుంటే... ఒక నీటి సంవత్సరం వృథా అవుతుంది. పనుల అంచనాలన్నీ పెరిగాయి. కానీ, ప్రధాన కాంట్రాక్టు సంస్థ చేసుకున్న ఒప్పందం మేరకు ధరలు పెంచేందుకు వీలు లేని పరిస్థితి నెలకొంది. అప్పటి స్టాండర్ట్‌ షెడ్యూల్డ్‌ ధర (ఎస్‌ఎ్‌సఆర్‌)ల మేరకు ప్రధాన కాంట్రాక్టు సంస్థ పనులు పూర్తి చేయలేదు. కాంట్రాక్టు సంస్థ ఆర్థిక పరిస్థితి కూడా బాగలేదు. దీనివల్ల పనులు మందకొడిగా జరుగుతున్నాయి. ట్రాన్స్‌ట్రాయ్‌కి బ్యాంకులు కూడా రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. పాత ఎస్‌ఎ్‌సఆర్‌ ధరలతో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం కష్టం. అందువల్ల కొత్త సంస్థను ఎంపిక చేయాల్సిన అవసరం వచ్చింది’’ అని చంద్రబాబు వివరించారు. ఈ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడమే తన లక్ష్యమని... ఏ కొద్ది పాటి సమస్య వచ్చిన వెంటనే పరిష్కరించుకోవాలన్న కృత నిశ్చయంతో ఉన్నానని వెల్లడించారు. తాను పది రోజుల పాటు విదేశాలకు వెళ్తున్నందున, ఆ సమయంలో పోలవరం పనులకు ఆటంకం కలుగకూడదనే నాగపూర్‌కు స్వయంగా వచ్చానని గడ్కరీకి చెప్పారు. పనులను వేగంగా పూర్తి చేసేందుకు ఆయన ముందు కొన్ని ప్రతిపాదనలను పెట్టారు. అవి... 1) ప్రస్తుతం కాంట్రాక్టు పనులు చేస్తున్న ప్రధాన సంస్థను పక్కకు తప్పించి.. ఈ-టెండర్లను పిలిచి కొత్త వారితో పనులు చేపట్టడం. అదే జరిగితే... ప్రస్తుత కాంట్రాక్టు సంస్థకు కొంత ప్రయోజనం కలిగేలా చూడాలి. 2) ప్రస్తుత కాంట్రాక్టర్‌కే ఇప్పుడున్న స్టాండర్ట్‌ షెడ్యూల్డ్‌ ధరలు వర్తింప చేయడం. ఈ ప్రతిపాదనలు విన్న గడ్కరీ.. కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ అధికారులు చేసిన సూచననూ ప్రస్తావించారు. దీనిప్రకారం ప్రాజెక్టుకు అవసరమైన మెటీరియల్‌ను ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. లేబర్‌ను మాత్రం కాంట్రాక్టుకు ఇస్తారు.

మీ శ్రద్ధ అర్థమైంది: గడ్కరీ
తనను కలిసేందుకు హుటాహుటిన నాగపూర్‌కు వచ్చారంటేనే పోలవరం ప్రాజెక్టుకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో తనకు అర్థమవుతోందని చంద్రబాబుతో గడ్కరీ అన్నారు. జల వనరుల శాఖ మంత్రిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టినందున... తనకు పూర్తిగా అవగాహన రాలేదని చెప్పారు. పోలవరంపై ఉన్న ప్రతిపాదనలపై ఈ నెల 24, 25 తేదీల్లో ఢిల్లీలో జల వనరుల శాఖ కార్యదర్శులు, ఉన్నతాధికారులతో సమావేశమై పోలవరం ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తానని గడ్కరీ వివరించారు. పోలవరం ప్రాజెక్టును తాను స్వయంగా చూశానని .. ఈ ప్రాజెక్టు పట్ల చూపుతున్న శ్రద్ధనూ గమనించానని అన్నారు. పోలవరం ప్రాజెక్టుపూర్తికి 100 శాతం సహకారం ఉంటుందని గడ్కరీ అన్నారు. నర్మదా సరోవర్‌ డ్యామ్‌ ప్రారంభోత్సవం సమయంలో పట్టిసీమ ద్వారా నదుల అనుసంధానానికి ఏపీ సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారంటూ ప్రధాని మోదీ కితాబు ఇవ్వడాన్ని గడ్కరీ ప్రస్తావించారు.

పోలవరంపై మరో కమిటీ
పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తిచేయడంలో భాగంగా ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌ట్రాయ్‌ నుంచి కొన్ని పనులను తప్పించి కొత్త సంస్థకు అప్పగించడం, అంచనాల పెంపుపై అధ్యయనం చేసేందుకు మరో కమిటీని నియమించాలని కేంద్ర జల వనరుల శాఖ నిర్ణయించింది. ఈ కమిటీని ఒకటి రెండు రోజుల్లోనే వేస్తామని రాష్ట్రప్రభుత్వానికి హామీ ఇచ్చింది. సోమవారం ఢిల్లీలో ఏపీ ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు.. కేంద్ర జలవనరుల కార్యదర్శి అమర్జిత్‌సింగ్‌తో పాటు ఆ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.

Rayapati's Transstroy India Ltd. gets Polavaram contract

Rayapati's Transstroy India Ltd. gets Polavaram contract

TNN | Nov 1, 2012, 01.12 AM IST

HYDERABAD: In a move that could raise the hackles of pro-Telangana groups, the state government on Wednesday granted the much-delayed Polavaram project tender to Transstroy India Limited, a company owned by Guntur Congress MP Rayapati Sambasiva Rao. Insiders said the move to grant the project tender to Rayapati is indicative of the Congress high command's efforts to placate the senior MP, who is sulking ever since he was denied a berth in the Union council of ministers recently.
The government asked the company to submit Rs 200 crore as a bank guarantee and enter into an agreement within 15 days. The value of tender was Rs 4,717 crore while Transstroy bagged the tender by quoting 14% less than the project cost. The four other bidders were -- Soma Constructions-CGCA, SEW Infrastructure Patel, Madhucon-Sinu Hydro and IVRCL."It was a clear strategy to pacify the Guntur MP by granting the tender to the company owned by him," sources said. Though the move could invite the ire of Telangana protagonists who want the contract for a company based in Telangana, the government went ahead with its decision. Rayapati has been threatening to quit the Congress for a long time. He flew into a rage when his request to be made the chairman of TTD was also not considered.
Environmental activists and locals have been maintaining that a minimum of 3,500 tribal villages will be submerged if the project materialises.

Sunday, 14 May 2017

డ‌బుల్ ధ‌మాకా..!

డ‌బుల్ ధ‌మాకా..!
15-05-2017 03:04:01

కరువుదీరా పండిన మినుములు
దేశమంతా పంటలే పంటలు
హైదరాబాద్‌, మే 14 (ఆంధ్రజ్యోతి): దేశంలో కరవుదీరా పంట పడింది. ప్రకృతి సహకరించడంతో ఈ ఏడాది ఆహార ధాన్యాల దిగుబడి గణనీయంగా పెరగబోతున్నాయి. అన్ని రాష్ట్రాలలోనూ వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతుండగా తెలంగాణలో కొన్ని పంటలు అసాధారణ పెరుగుదల రేటు నమోదు చేస్తున్నాయి. 2016-17 వ్యవసాయ సంవత్సరంలో దిగుబడులకు సంబంధించి మూడో అంచనాలను కేంద్రం తాజాగా విడుదల చేసింది. 2015-16తో పోలిస్తే అన్ని రకాల ఆహారోత్పత్తులు కలిపి రెండు కోట్ల టన్నులకు పైగా అధికంగా పండబోతున్నాయి. 2015-16లో దేశవ్యాప్తంగా 9.1 కోట్ల టన్నుల వరిధాన్యం ఉత్పత్తికాగా అది ఇప్పుడు 9.6 కోట్ల టన్నులకు పెరగబోతోంది. గోధుమలు 9.2 నుంచి 9.7 కోట్ల టన్నులకు పెరుగుతోంది. ఆహార, చిరుధాన్యాలు కలిపి 2015-16లో 25.1 కోట్ల టన్నులు ఉత్పత్తి కాగా తాజా అంచనాల ప్రకారం 2016-17లో 27.3 కోట్ల టన్నులకు పెరగబోతోంది. నూనె గింజల ఉత్పత్తి 85 లక్షలు టన్నుల నుంచి 97 లక్షల టన్నులకు పెరగబోతోంది. జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణలో వ్యవసాయోత్పత్తుల పెరుగుదల రేటు అధికంగా ఉంది. వరిధాన్యం ఉత్పత్తి 82ు మేర పెరుగుతోంది. కంది ఉత్పత్తిలో ఏకంగా 135ు పెరుగుదల నమోదైంది. మినుముల ఉత్పత్తి కూడా తెలంగాణలో భారీగా 127ు మేర పెరుగుతున్నాయి. ప్రభుత్వం నిరుత్సాహపరచడంతో పత్తి ఒక్కటే ఉత్పత్తి 21ు తగ్గుతోంది. దాంతో పత్తి రైతులకు మంచి ధర లభిస్తోంది. ఏపీలో పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. బియ్యం ఉత్పత్తి కేవలం 4.6ుపెరుగుదల నమోదైంది. వేరుశెనగ 28.5ు, చెరకు 21.8ు మేర తగ్గుదల నమోదు అయ్యాయి. మిర్చి మాత్రం ఏకంగా 42.9ు అధికంగా ఉత్పత్తి అవుతోంది. వేరుశెనగ ఏపీలో తగ్గితే తెలంగాణలో పెరిగింది.